సిరా న్యూస్, గుడిహత్నూర్:
జీవవైవిధ్యంతోనే మనుగడ సాధ్యం..
ఈ భూమిపై మానవాళి మనుగడ కొనసాగాలంటే జీవవైవిధ్యంతోనే సాధ్యమని గీతాంజలి ట్రస్ట్ స్కిల్ ట్రైనర్ హరీష్ అన్నారు. ఆదివారం ఆయన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని 1వ నంబరు వార్డులో స్థానికులకు, చిన్నారులకు అవగహణ కల్పించారు. ప్రకృతిలో ఇప్పటికే అనేక రకాల జీవజాతులు అంతరించిపోయాయని అన్నారు. మరికొన్ని జాతులు అంతరించేందుకు చేరువలో ఉన్నట్లు తెలిపారు, అన్ని రకాల జీవులు ఉంటేనే భూమిపై మానవాళికి భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా స్థానిక చిన్నారులు తాము గీసిన పక్షులు, వివిద రకాల జంతువుల చిత్రాల ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రతీ ఒక్కరు తమ చుట్టూ ఉన్న మూగజీవులకు, పశువులకు అహారం, నీళ్లు అందించాలని కోరారు.