సిరా న్యూస్, దస్తురాబాద్:
దస్తురాబాద్లో ఉచితం కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలో సమృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలమడుగు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని యువత కోసం కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించడం సంతోషకరమన్నారు. నేటి కాలంలో కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా మారిందన్నారు. కంప్యూటర్ స్కిల్స్ ఉన్నవారి కోసం అనేక ఉద్యోగ ఆవకాశాలు ఉన్నాయని అన్నారు. సమృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ సెంటర్ను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సమృద్ధి సొసైటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.