సిరా న్యూస్,వరంగల్;
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ముందు రైతులు ధర్నాకు దిగారు. మిర్చికి మద్దతు ధర చెల్లించకుండా రైతులను మోసం చేస్తున్నారని గేట్ ముందు బైఠాయించి ధర్నా చేసార. రైతుల ధర్నాతో ట్రాఫిక్ స్తంభించింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తేజ మిర్చి క్వింటాకు 21,000 మార్కెట్లో పలుకుతుండగా కేవలం 13 వేలకు క్వింటా చొప్పున రైతుల నుండి విక్రయిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సరైన మద్దతు ధర ప్రకటించకుండా రైతులను మోసం చేస్తున్నారని ఏనుమాముల మార్కెట్ ప్రధాన రహదారిపై బైఠాయించారు.