ఓయూ సంబరాలు
సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రజా పాలనకు కేసిఆర్ పాలనకు చాలా తేడా ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముప్పై రోజులు అయిన సందర్భంగా చనగాని దయాకర్ అధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి విద్యార్థులు,నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి జనరల్ సెక్రటరీ బాలలక్ష్మి, ఎన్ ఎస్ యూ ఐ విద్యార్థి నాయకుడు మేడ శ్రీను, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజాపాలన 30 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఒక స్వేచ్ఛా,సమానత్వం,స్వయంపాలన ఒక కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అనేది ఈ ముప్పై రోజుల్లోనే నిరూపించుకున్నారు.ఈ ముప్పై రోజుల్లోనే అనేక సంస్కరణలు జరిగాయి,గత ప్రభుత్వం పోరాడే హక్కును కాలరాసింది.ఈ ముప్పై రోజులు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి,మంత్రులు అహర్నిశలు కృషి చేస్తున్నారు.ఇంకా ముందు ముందు కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన కొనసాగిస్తుంది అని దయాకర్ తెలిపారు.