సంజీవనగర్ శ్రీ కోదండ రామాలయం లో పూజలు.
ప్రముఖుల మద్దతు కోరుతున్న రాజేష్.
సిరా న్యూస్,నంద్యాల;
రాజకీయాల్లోకి ఆర్య వైశ్య యువకుడు గోళ్ల రాజేష్( రాజేంద్ర ప్రసాద్) అడుగుపెట్టారు.నంద్యాలకు చేరుకున్న రాజేష్ సంజీవ నగర్ లోని శ్రీ కోదండ రామాలయం లో పూజలు నిర్వహించారు.రాజకీయాల్లోకి అడుగుపెట్టడం తో కుల మతాలకు అతీతంగా పట్టణంలోని పెద్దల ను కలుస్తూ రాజకీయంగా అండదండలు కావాలని కోరుతున్నారు.నంద్యాలలో గత 25 ఏళ్ల నుంచి ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలే పోటీలో వుంటున్నారు.ఓట్ల పరంగా మూడవ స్థానంలో ఆర్య వైశ్యులు ఉన్నా రాజకీయంలో వెనకపడ్డారు.పట్టణంలో గౌరవ కుటుంభానికి చెందిన యువకుడు కావడంతో అన్ని వర్గాలతో పరిచయాలు వుండడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.అన్ని వర్గాలతో కలసి ముందుకు వెళతానని పేర్కొన్నారు.