Kandi With CM Revanth Reddy: సమీక్షా సమావేశంలో కంది…

సిరా న్యూస్, డిజిటల్‌:

సీఎం సమీక్షా సమావేశంలో కంది…
+ సీఎం రేవంత్‌ రెడ్డిని కలసిన కంది శ్రీనివాస రెడ్డి

కాంగ్రేస్‌ పార్టీ ఆదిలాబాద్‌ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి, సీఎం రేవంత్‌ని రెడ్డిని కలుసుకున్నారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించగా, ఆ సమావేశానికి కంది శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. నెల రోజుల పాలన, ప్రజాపాలన దరఖాస్తులు, తదితర అంశాలపై సీఎం చర్చించినట్లు సమాచారం. కాగా సమీక్షా అనంతరం కంది శ్రీనివాస రెడ్డి, సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసారు. స్థానికంగా ప్రజాపాలన కొనసాగిన తీరు, నియోజక వర్గంలో ఏండ్లుగా నెలకొని ఉన్న సమస్యలు, తదితర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *