సిరా న్యూస్,పెద్దపల్లి;
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు .పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి, తారుపల్లి, పందిళ్ళ గ్రామంలోని గుడుంబా స్థావరాలపై సుల్తానాబాద్ ఎక్సెజ్ సీఐ ఆనందరావు ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 350 లీటర్ల బెల్లం పానకం ,13 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. దాడిలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. గుడుంబా స్థావరాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.అక్రమంగా గుడుంబా తయారు చేసినా, అమ్మినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ దాడుల్లో హైదరాబాద్, కరీంనగర్, పెద్దపెల్లి, ఎక్సైజ్ టీమ్స్ పాల్గొన్నాయి.