ఒంటి కాలిపై నిలబడి తమ నిరసనను తెలిపిన మున్సిపల్ కార్మికులు
సిరా న్యూస్,బద్వేలు;
జగనన్న హామీలను అమలు చేయాలని కోరుతూ… మున్సిపల్ కార్మికులు చేస్తున్న రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె ఒంటి కాలిపై నిలబడి మున్సిపల్ కార్మికులు బుధవారం తమ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా యూనియన్ పట్టణ కోశాధికారి కాలువ శివకుమార్ మాట్లాడుతూ…. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఈరోజు జరుగుతున్న చర్చలను కార్మికులకు అనుకూలంగా జరిపి సమ్మెను నివారించాలని సమాన పనికి- సమాన వేతనం అమలు జరిపి కనీస వేతనం 26,000/- ఇవ్వాలని, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, పెరుగుతున్న పట్టణాల జనాభా, విస్తీర్ణం దృష్ట్యా కార్మికులను పెంచాలని, కోవిడ్- 19 అదనపు పారిశుద్ధ్య సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇంజనీరింగ్ విభాగ కార్మికులకు వేతనాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ పట్టణ అధ్యక్షులు పులి శ్యామ్ ప్రవీణ్, వర్కింగ్ అధ్యక్షులు దియ్యాల హరి, ప్రధాన కార్యదర్శి దియ్యాల నాగేంద్రబాబు యూనియన్ పట్టణ నాయకులు గంటా శ్రీనివాసులు, దియ్యాల దేవమ్మ, నాగారపు సత్యరాజు,నేలటూరి పాలయ్య, ఇండ్ల చంద్రశేఖర్,పద్మిశెట్టి రామయ్య,తేళ్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.