-పత్రాలను అందజేసిన జిల్లా మత్స్య సహకార సంఘం డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్
సిరా న్యూస్,మంథని;
మంథని మండలం విలోచవరం గ్రామంలో 35 మంది సభ్యులతో కూడిన మహిళ మత్స్యపారిశ్రామిక సంఘం ను ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి చీఫ్ ప్రమోటర్ గా జునుగరి శ్రుతి ని నియమించారు. నూతన మహిళా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం పత్రాలను మహిళా సభ్యులకు పెద్దపల్లి జిల్లా మత్స్య సహకార సంఘం డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్ బుధవారం విలోచవరం గ్రామంలో అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా డైరక్టర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ మంథని మండలంలోని ప్రతి గ్రామంలో మహిళలు ముందుకు వచ్చి మహిళ మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చెందాలని, మన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళ మత్స్యశాఖ సంఘాలకు సహాయ సహకారాలు అందించాలని అలాగే ఈ విలోచవరం మహిళ సొసైటీ ఏర్పాటు కు సహకరించిన
పెద్దపల్లి డీఎఫ్ఓ అధికారి భాస్కర్ కు, కృషి చేసిన విలోచవరం మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షులు జునుగరి బాపు కు, సర్పంచ్ బండ రమేష్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జిల్లా డైరెక్టర్ క్రాంతి కుమార్ ను మహిళా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమం లో మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షులు నరెడ్ల బొంద్యాలు, కార్యదర్శి జునుగరి రాజయ్య, ఉపసర్పంచ్ తూడ్ల అంజన్న తో పాటు మహిళ మత్స్య సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.