నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి
బాధిత కుటుంబాలకు సాయం అందజేత
సిరా న్యూస్,నందవరం;
మండల పరిధిలో నిజం గెలవాలి కార్యక్రమంలో కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శించారు. ఏమ్మిగనురు నియోజకవర్గం, నందవరం మండలం, మచాపురం గ్రామంలో బోయ కొండ హనుమంతు ముగితి గ్రామంలో నాగరాజు కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన బోయ కొండ హనుమంతు,ముగితి గ్రామంలో నాగరాజు భార్య , కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరమ్మ ఓదార్చి బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కును అందజేశారు.కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు,యం.యల్.సి బి.టి.నాయుడు ,ఎమ్మిగనూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి మాచాపురం మాజీ సర్పంచ్ మండలాలు క్లస్టర్ ఇంచార్జ్ ఖాసీం వలి , ముగతి జెడ్పిటిసి ఈరన్న గౌడ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాధవస్వామి దేశాయ్ , నెట్వర్క్ అధినేత గురు రాజారావు ,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పాల్గొన్నారు.