రాజ్యసభ…రగడ…

సిరా న్యూస్,విజయవాడ;
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జమిలీ ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో రాజ్యసభ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 2 నాటికి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ మూడు స్థానాల ఎన్నికలు మార్చ్‌లోనే జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం చూస్తే వైసీపీకే మూడు రాజ్యసభ స్థనాలు దక్కుతాయి. ఈ మూడు స్థానాలకు సీఎం జగన్ అభ్యర్థుల్ని కూడా ఖరారు చేశారు. కానీ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం ఉండి కూడా ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. టిక్కెట్ల కసరత్తులో భాగంగా భారీగా మార్పులు చేర్పులతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఇప్పటికే రాజీనామా చేశారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు. ఈ క్రమంలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్ని వైసీపీ గెల్చుకోగలదా అనేది సందేహంగానే మిగిలింది. ఏపీలో ఇప్పుడు సీఎం రమేశ్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ మూడు స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముగ్గురిని ఖరారు చేసింది. పాయకరావు పేట ఎమ్మెల్యేగా ఉన్న ఎస్సీ సామాజికవర్గానికి చెందిన గొల్ల బాబూరావు, బలిజ సామాజికవర్గానికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పేర్లను దాదాపుగా ఖరారు చేశారు. మూడు స్థానాల్ని దక్కించుకోవడం వైసీపీకు చాలా అవసరం. సాధారణ పరిస్థితుల్లో అయితే వైసీపీకు ఉన్న సంఖ్యాబలంతో మూడు రాజ్యసభ స్థానాల్ని గెల్చుకోవడం కష్టమేం కాదు. ఇటీవల టీడీపీ గోడ దూకిన నలుగురు జంప్ జిలానీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను వైసీపీ అధిష్టానం కోరిన కొన్ని గంటల్లోనూ వైసీపీ శిబిరంలో రెస్టు తీసుకొంటున్న నలుగురు తమ పార్టీ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని టీడీపీ ఫిర్యాదు చేయాలని నిర్ణియంచుకుంది. ఈ మేరకు సభాపతికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. వైసీపీ గోడ దూకిన టీడీపీ కోటలో చేరిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కి వైసీపీ ఫిర్యాదు చేయగా.. ఇక టీడీపీ గుమ్మం దాటి వైసీపీ ఇంట్లో కాపురం పెట్టిన కరణం బలరామ కృష్ణమూర్తి, వల్లభనేని వంశీ మోహన్, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ పై వేటు వేయాలని టీడీపీ కోరుతోంది. జనసేన ఎమ్మెల్యేరపైనా అనర్హతా వేటుకు సిఫారసు చేయనున్నారు. నాలుగేళ్ల కిందటే ఐదుగురూ టీడీపీ నుంచి వైసీపీ వైపుగా నడచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు వేశారు . అందుకే ఆ నలుగురు ఎమ్మెల్యేల మీద వైసీపీ అనర్హత వేటు కోరుతోంది.ఈ నలుగురు కూడా గత ఏడాది మార్చినే విప్ ను ఉల్లంఘించారు. కానీ మరో నెలలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న సమయంలో అనర్హతా వేటుక ుసిఫారసు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తులు పై ఎత్తులతో ఈ అనర్హత వేటు అంశాన్ని తెరమీదకు తెచ్చారు. ఇందులో మరో మతలబు ఉంది. వైసీపీ నలుగురి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినా ఆ నంబర్ తగ్గుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన టీడీపీ కూడా తమ ఎమ్మెల్యేలపైనా ఈ ఫిర్యాదు చేసి.. అధికార పార్టీకీ నాలుగు ఓట్లు తగ్గించాలనే ఈ వ్యూహాన్ని అమలు చేశారని అనుకోవచ్చు. నిజానికి ఒక్క స్థానం నుంచి పోటీ చేసినా టీడీపీకి తమకు ఉన్నంత మంది ఎమ్మెల్యేల మద్దతు బయట నుంచి కావాలి. అయినా సరే ఓ స్థానం నుంచి టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు జగన్ రెడ్డికి గుడ్ బై చెప్పి తమ దారి తాము చూసుకుంటారో అంచనా వేయడం కష్టంగా మారింది. ఇప్పటికే పది మంది గుడ్ బై చెప్పేసిననట్లుగా చెబుతున్నారు. వారు వేరే వారికి ఓటేస్తారా… ఓటింగ్ కు హాజరు కారా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. చాలా మంది అసంతృప్తిలో ఉన్నారు. ప్రభుత్వం మళ్లీ రాదని ఎక్కువ మంది నమ్ముతూండటంతో… టీడీపీతో టచ్ లోకి వెళ్లిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఓ జనసేన ఎమ్మెల్యేపై కూడా అనర్హతా వేటు వేయాలని స్పీకర్‌కు టీడీపీ, జనసేనలు ఫిర్యాదు చేయనున్నాయి. ఈ నలుగురిపై వేటు వేసి.. ఆ ఐదుగురని వదిలిస్తే.. స్పీకర్ తీరుపై విమర్శలొస్తాయి. అయితే అనర్హతా వేటు వేసినా వేయకపోయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ గెలవాలంటే.. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ కీలకం. ఆ క్రాస్ ఓటింగ్ ను ఆపలేకపోతే.. ఎవరిపై అనర్హతా వేటు వేసినా ప్రయోజనం ఉండదన్న వాదన వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *