కడప నుంచి షర్మిళ..?

సిరా న్యూస్,కడప;
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై పక్కాగా ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకే కాకుండా లోక్‌సభ ఎన్నికల కోసం ఆయా పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన షర్మిల తాను పోటీ చేసే స్థానంపై తర్జన భర్జన పడుతున్నారు. అసెంబ్లీకి వెళ్లాలా.. లేక పార్లమెంటు‌కు వెళ్లాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఆమె సన్నిహితుల సమాచారం మేరకు వైఎస్ షర్మిల కడప పార్లమెంటు సెగ్మెంట్ నుంచి బరిలో ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎంపీగా వైసీపీ నుంచి అవినాష్‌‌‌రెడ్డి మరో సారి పోటీకి సిద్ధంగా ఉన్నారు. బలాబలాల పరంగా ఆ పార్లమెంటు పరిధిలో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. దీంతో కాంగ్రెస్ అక్కడ బలమైన ప్రత్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.వైఎస్‌ఆర్ వారుసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన షర్మిలను కడప నుంచి బరిలోకి దింపితే అవినాష్ ‌రెడ్డికి ధీటుగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో అసలు షర్మిల ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు, ఎన్నికలు దగ్గర పడిన వేళ ప్రజల్లోకి వెళ్లారా.. అన్నది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే తన తండ్రి హత్యపై ఉన్న అనుమానాలతో అవినాష్ ‌రెడ్డిపై కోపంతో రగిలిపోతున్న వివేకానంద ‌రెడ్డి కూతురు సునీత కూడా కాంగ్రెస్ నేతలతో షర్మిలను కడప నుంచే పోటీలో ఉంచాలని సూచించినట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో షర్మిల కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని, అందుకు అనుగుణంగా కడప నేతలతో మంతనాలు కొనసాగిస్తున్నారని సమాచారం. డప పార్లమెంట్ స్థానం వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. గతంలో వైఎస్ఆర్, వైఎస్ వివేకనంద రెడ్డి, జగన్ , అవినాష్ రెడ్డి… ఇలా వైఎస్ కుటుంబ సభ్యులు కడప పార్లమెంట్ స్థానానికి ప్రతినిధ్యం వహించారు. వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం కడపగా ఎంపీగా ఉన్నారు. ఆయన్ను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జగన్ చూస్తున్నారు. అవినాష్ రెడ్డిని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయిస్తారని సమాచారం. కడప ఎంపీగా కుటుంబ సభ్యుడైనా డాక్టర్ అభిషేక్ రెడ్డిని బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల సమయంలోనూ అభిషేక్ రెడ్డి పేరు రాజకీయంగా తెర మీదకు వచ్చింది. కాని ఆ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపారు. ప్రస్తుతం అభిషేక్ రెడ్డి సింహాద్రిపురం, లింగాల మండలాల వైసీపీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో అభిషేక్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు. కాని షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగితే.. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో సెంటిమెంట్‌కు తావు లేదనే విషయం జగన్‌కు బాగా తెలుసు. షర్మిలను ధీటుగా ఎదుర్కొనకపోతే అది మొదటికే మోసం వస్తుందని.. అందుకే బలమైన అభ్యర్థిని ఆమెపై దించుతారని టాక్ అధికార పార్టీలో నడస్తోంది. నిజంగానే షర్మిల కడప బరిలో ఉంటే ఆమెపై వైఎస్ భారతిని సైతం పోటీకి దించడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని సమాచారం. లేకుంటే అంతకుమించి వ్యూహాన్ని అమలు చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. షర్మిల అడుగులు బట్టి జగన్ వ్యూహాలు ఉంటాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి షర్మిలపై జగన్ ఎలాంటి రాజకీయ వ్యూహాలను అమలు చేస్తారో చూడాల్సి ఉంది.ది ఏమైనా.. కడప ఎంపీ బరిలో ఎవరెవరో నిలుస్తారో.. నిలిచి గెలుస్తారో మరికొన్ని నెలలు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *