సిరా న్యూస్, ఆదిలాబాద్:
మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన బాలూరి గోవర్ధన్ రెడ్డి…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం జామ్ని గ్రామంలో ఇటీవలే తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన కుమ్ర కేశవ్ కుటుంబ సభ్యులను జైనథ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్, కాంగ్రెస్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం నాయకులతో కలిసి జామ్ని గ్రామానికి వెళ్లిన ఆయన బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పెందుర్ మోహన్, పెందుర్ తానాజీ, ఇతర గ్రామస్తులు ఉన్నారు.