రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్దిగా మెట్టు గోవిందరెడ్డి

సిరా న్యూస్,అనంతపురం;
అనంతపురం జిల్లా రాయదుర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఏపీఐఐసీ చైర్మన్ గా ఉన్న మెట్టు గోవిందరెడ్డికి సీటు కేటాయించడంతో వైసిపి నాయకులు కార్యకర్తలు, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు.
మెట్టు గోవిందరెడ్డి 2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాపు రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మెట్టు గోవిందరెడ్డి చాలా రోజుల నుంచి టిక్కెట్ తనకే దక్కుతుందనే నమ్మకంతో ప్రజల్లో తిరుగుతున్నారు.
రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ ఇంఛార్జి గా మెట్టు గోవింద రెడ్డి రెండు రోజుల ముందే ప్రకటించుకున్నారు. నిజానికి కాపు రామచంద్రారెడ్డి స్థానంలో రాయదుర్గం లో మరో నాయకుడి కోసం వైసీపీ నాయకత్వం సెర్చ్ చేసింది. చివరికి మెట్టు గోవిందరెడ్డినే అభ్యర్థిగా ప్రకటించారు. ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ కాగానే ప్రజల్లో మమేకమై పార్టీ విజయానికి కృషి చేస్తానని మెట్టు గోవింద రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి టికెట్ నిరాకరించడంతో వైసిపి నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా రాజీనామాలు చేయలేదని నాకు టికెట్ కన్ఫామ్ అవుతుందని నమ్మకంతో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు తనకు అండగా ఉన్నారన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సమస్యలపై పోరాడుతూ పనిచేస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *