సిరా న్యూస్, బేల:
ఘనంగా రాజమత జీజాబాయి, స్వామి వివేకానంద జయంతి వేడుకలు..
అదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని స్థానిక శివాజీ చౌక్ లో రాజమాత జీజాబాయి, స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొఘల్ సామ్రాజ్యంతో పోరాడిన వీరుడు చత్రపతి శివాజీ అని, ఆయన పోరాటపటిమ, పోరాట స్ఫూర్తి, అతని తల్లి జీజాబాయి నూరి పోసిన వీరుల గాధల వల్లనే సాధ్యమైందని అన్నారు. ప్రతి ఒక్కరు జీజాబాయి ని స్ఫూర్తిగా తీసుకొని, తమ కుమారులను వీరులుగా తీర్చిదిద్దాలని పలువురు మరాఠా సంఘం, యువజన సంఘాల నాయకులు అన్నారు. యువత చెడు వ్యసనాలను వీడి, సన్మార్గంలో నడిచినప్పుడే స్వామి వివేకానందునికి నిజమైన నివాళి అని వారు అన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటిన మహనీయుడు వివేకానందుడని కొనియాడారు. ఈ సందర్బంగా జీజాబాయి, వివేకానందుడి చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాలు, మరాఠా సంఘం నాయకులు, టిఆర్ఎస్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.