సిరా న్యూస్, చిగురుమామిడి:
కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి
– ఎంపీ బండి సంజయ్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలందరికీ అందేలా చూడాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలని అమలు చేస్తోందని అన్నారు. ఈ సంక్షేమ పథకాలను గురించి, బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.