గంజాయి స్వాధీనం…ఐదుగురు అరెస్టు

సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ క్రాస్ వద్ద గంజాయి తరలిస్తున్న ఐదుగురు యువకులను ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసారు. పది లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు బిటెక్ విద్యార్థులు, ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగి వున్నారు. ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ
ఘట్ కేసర్ క్రాస్ వద్ద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య అధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా కాకినాడ నుండి సతీష్ అనే వ్యక్తి వాగన్ ఆర్ కారులో హైదరాబాద్ కి గంజాయి తరలిస్తుండగా తనిఖీలలో కారులో గంజాయి దొరికింది. అక్కడే మరో టీవిఎస్ స్టార్ బైక్ పై గంజాయి తరలిస్తున్న ప్రణీత్, సదానందంలకు అదుపులోకి తీసుకోగా వారి వద్ద గంజాయి దొరికింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. మొత్తం పది లక్షల రూపాయల విలువ చేసే పది కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు, ఐదుగురు నిందితుల్ని రిమాండ్ కి తరలించనున్నట్లు మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *