కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణ..

సిరా న్యూస్, బేల:

కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణ..

అదిలాబాద్ జిల్లా బేల మండలంలో జునోని గ్రామంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న కొమరం భీగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, స్థానిక నాయకులు ఆయన్ను ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం అయినటువంటి డోలు వాద్యాలు తో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… గెలుపోటములతో సంబంధం లేకుండా తాను ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని ఆయన అన్నారు. ఆదివాసుల కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి ఏ ప్రభుత్వం చేయలేదని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వం కుమరంభీం ఆశయాలను పక్కన పెట్టి స్వార్థ పూరిత రాజకీయాల కోసం ఆదివాసులను వాడుకోవడం జరిగిందని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొమరం భీమ్ ఆశయా సాధన కోసం ఎంతగానో కృషి చేశారని, రూ. 50 కోట్ల నిధులతో మ్యూజియాన్ని ఏర్పాటు చేసి ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలు చిరస్థాయిగా నిలిచిపోయేలా నిర్మాణాలు చేపట్టారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ప్రమోద్ రెడ్డి, రౌత్ మనోహర్, గంభీర్ ఠాక్రే, దేవన్న ఒల్లఫ్ వార్, గెడం సునీల్, అరుణ్ కొడపే, భాస్కర్ సెండే తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *