సిరా న్యూస్, చిగురుమామిడి:
ఊరికెళ్తున్నారా… జాగ్రత్త
-చిగురుమామిడి ఎస్సై బండి రాజేష్
అనుమానస్పద వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచన
సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా సొంత ప్రాంతాలకు, బంధువుల ఇండ్లకు, విహార యాత్రలకు వెళ్లే వారు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, చిగురుమామిడి ఎస్సై బండి రాజేష్ సూచించారు. శుక్రవారం ఈ మేరకు ఆయన పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోలీసుల సలహాలు సూచనలు పాటిస్తూ, దొంగతనాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు వెండి ఆభరణాలు డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలిని అన్నారు. ఇండ్లకు సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం, సెక్యూరిటీ అలారం మోషన్ సెన్సార్లు, సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదని అన్నారు. దొంగతనాలతోపాటు ఇతర నేరాల నియంత్రణకు తీవ్రంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీస్ స్టేషన్ కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని, టోల్ ఫ్రీ నెంబర్ 100 కు ఫోన్ చేయాలని సూచించారు.
Nice information