సిరా న్యూస్,ఏలూరు;
పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందాల బరులకు సర్వం సిద్ధం అయ్యాయి. పందెం రాయుళ్లు పోలీసుల హెచ్చరికలను పట్టించుకోవడంలేదు. కాళ్ల మండలం పెదమిరంలో క్రికెట్ గ్రౌండ్ను తలపించేలా పందెం బరులు వెలిసాయి. గత ఏడాది ఇదే సమయానికి ఏర్పాటుచేసిన పందెంబరులను పోలీసులు ధ్వంసం చేసారు. ప్రస్తుతం జిల్లా పోలీస్ బాస్ హెచ్చరికలు ప్రకటనలకే పరిమితమైయాయి. జిల్లావ్యాప్తంగా గుట్టు చప్పుడు కాకుండా పందేల నిర్వహణకు ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం.