సిరా న్యూస్,హైదరాబాద్;
కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ లోకి ఆహ్వానిస్తే తప్పకుండా చేరతామని టీజేఏస్ చీఫ్ కోదండరాం స్పష్టం చేసారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వంలో , ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని రాహుల్ గాంధే స్వయంగా హమీ ఇచ్చినట్లు తెలిపారు. పదవులు బాధ్యత తప్ప తమకు అవేమి అధికారాన్ని అనుభవించే అవకాశం కాదని చెప్పారు. తమపార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని తెలిపారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితి పోటీ చేయకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో ఆయన ఆలోచనల్ని..సేవల్ని తెలంగాణ అభ్యున్నతి కోసం వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ముందు నుంచీ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంమలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిని చేయాలని అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ రెండు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఒకటి కోదండరాంకు ఇచ్చేలా హైకమాండ్ కు రేవంత్ సిఫారసు చేశారని చెబుతున్నారు. వారి నుంచి అనుమతి రాగానే తన తదుపరి చర్యలు తీసుకుంటారు. రాజ్యసభ ఇస్తారని గతంలో ప్రచారం జరిగినా ఆయనను మంత్రిని చేయాలని కోదండరాం అనుకుంటున్నారని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం పాత్ర కీలకం. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. కానీ జరిగిన పోరాటాన్ని బీఆర్ఎస్ మాత్రమే క్యాష్ చేసుకుంది. తర్వాత కోదండారంకు పెద్దగా ఆదరణ లభించలేదు. బీఆర్ఎస్గా మారిన టీఆర్ెస్ తరపున పని చేయడానికి అంగీకరించలేదు. కోదండరాం మొదటి నుంచి కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని చెప్పుకున్నారు. కానీ ఆయన తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు. 2019 కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో భాగంగా పోటీ చేశారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారుపదవుల కోసం అయితే కేసీఆర్ వెంటే ఉండేవారని.. ఆయన తెలంగాణ బాగు కోసమే పని చేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. తెలంగాణ ప్రభుత్వ ఇమేజ్ పెంచుకోవడానికి ఆయన సేవలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. కోదండరాంను మంత్రిని చేస్తే.. బీఆర్ఎస్ పై నైతికంపై పైచేయి సాధించినట్లవుతుంది. కోదండరాం కూడా తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగంగా పని చేయాలని నిర్ణయించుకున్నారు
నెలాఖరుకు విస్తరణ
తెలంగాణ మంత్రివర్గాన్ని ఈనెలాఖరున విస్తరించే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టులను కొన్నింటిని ప్రకటించేందుకు కసరత్తు తుది దశకు చేరినట్లు సమాచారం. ఇక మంత్రివర్గ విస్తరణలో ప్రొఫెసర్ కోదండరామ్ను తీసుకోవడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి కోదండరామ్కు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారు. దీంతో కోదండరామ్ను మత్రిని చేసి విద్యాశాఖను అప్పగించాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరామ్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్పై నైతికంగా పైచేయి సాధించవ్చని రేవంత్ భావిస్తున్నారు. ఇక, మిగిలిన 5 మంత్రి పదవుల్లో షబ్బీర్ అలీకి ఒకటిఖాయమని చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మధ్యే పోటీ నెలకొంది. చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిశారు. రేవంత్ తనకు అవకాశం ఇస్తారని వివేక్ నమ్మకంతో ఉన్నారు. ఇక నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు కూడా కేబినెట్ ఛాన్స్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు గెలవలేదు. అయినా మైనారిటీ కోటాలో ఫిరోజ్ఖాన్ను మంత్రిని చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే షబ్బీర్ అలీ, ఫిరోజ్ఖాన్లలో ఒకరికి మాత్రమే మంత్రిపదవి ఇచ్చే అవకాశం ఉంది