సిరా న్యూస్,నాగర్ కర్నూలు;
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త, కుటుంబీకుల వేధింపులకు ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డది. తమ బిడ్డ ఆత్మహత్యను జీర్ణించుకోలేని కుటుంబీకులు భర్తని దారుణంగా కొట్టి చంపిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది..
లింగాల మండలం చెన్నంపల్లి గ్రామంలో వివాహిత సింధు అనుమాన స్పదంగా మృతి చెందింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోశుక్రవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మనస్థాపానికి గురైన సింధు ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందింది. దీనికి భర్త నాగార్జున కారణమని అనుమానించిన కుటుంబికులు దారుణంగా చితకబాదారు. దెబ్బలకు తాళలేక నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. మృతులు ఇద్దరికీ ప్రేమ వివాహం మూడు ఏండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నరు. సింధు నాగార్జున మధ్య కొంతకాలంగా వివాదాలు ఉన్నాయని అందరూ అంటున్నారు.