Fake RTEA gang arrested :నకిలీ ఆర్టీయే ముఠా అరెస్టు

సిరా న్యూస్, నంద్యాల;
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామం సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద ఆర్టీయే శాఖ అధికారులమని చెప్పి వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను శనివారం టౌన్ ఎస్ఐ వెంకటరెడ్డి అరెస్టు చేశారు. స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకటరామయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆళ్లగడ్డకు చెందిన విల్సన్ కుమార్, దూదేకుల ఉసేనయ్య, చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తులను అరెస్టు చేసి ఒక కారును, 2,200/- రూ. నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలు అయి డబ్బుల కోసం మోసం చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన హెడ్ కానిస్టేబుల్ హుస్సేని, కానిస్టేబుల్ ఉదయ్, మునీశ్వర్, హోంగార్డులు ప్రసాద్, ఓబులేసు, రుద్రుడు లను డీఎస్పీ వెంకటరామయ్య అభినందించారు. మీడియా సమావేశంలో టౌన్ సిఐ రమేష్ బాబు, టౌన్ ఎస్ఐ వెంకటరెడ్డి పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *