సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఘాన్సి మియా గూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బైకు, ఆటో, కారు ఢీకొని అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లాయి. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు దంపతులు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి విస్తరణ కోసం తీసిన కల్వర్టు వద్ద ప్రమాదం జరిగింది. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.