తీర్పు చెప్పిన కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి గొల్ల శ్రీదేవి
వివరాలు వెల్లడించిన బద్వేలు రూరల్ సీఐ విక్రమ సింహ
సిరా న్యూస్,బద్వేలు;
బద్వేల్ మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన గొడుగునూరు శిరీష (19) 2021 జూన్ 18వ తేదీ దారుణ హత్యకు గురైంది. ఆమె స్వగ్రామంలోనే ముగ్గురు యువకులు ఆమెను దారుణంగా హత్య చేశారు. ఆమె ఇంటి వద్దనే ఈ దారుణం చోటు చేసుకుం.ది శిరీష బద్వేల్ పట్టణం వీరారెడ్డి కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుంది. ఆమెను అట్లూరు మండలం మాడపూరు గ్రామానికి చెందిన బాలరాజు చరణ్ అనే వ్యక్తి శిరీషను ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. ఆమె కళాశాలకు వెళ్ళినప్పుడు ఆమె వెంటపడి వేధించేవాడు.
ఇలా రోజులుగా జరుగుతుండేది. ఈ క్రమంలో బాలరాజు చరణ్ తన స్నేహితులు నయాబ్ రసూల్, సోమల నరసింహలను వెంటబెట్టుకొని తన ఇంటి వద్ద పత్తి చేనులో పనిచేస్తున్న శిరీషను అత్యంత కిరాతంగా హత్య చేశారు. ఆమె శరీరంపై 24 సార్లు కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. విద్యార్థి శిరీష హత్య కడప జిల్లా వ్యాప్తంగా అప్పట్లో సంచలనంగా మారింది. అప్పటి బద్వేలు రూరల్ పోలీస్ సిఐ రమేష్ బాబు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీఐ రమేష్ బాబు తో పాటు ఆ తర్వాత వచ్చిన సీఐ హనుమంతు నాయక్ ఇప్పుడు సీఐ విక్రమ సింహ పూర్తిస్థాయిలో విచారణ జరిపి కోర్టుకు ఆధారాలు సమర్పించారు. దీంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి ఈ ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పినట్లు బద్వేలు గ్రామీణ ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు