సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఎస్పీ గౌస్ ఆలంను కలిసిన కంది శ్రీనివాస రెడ్డి
+ పూలబొకే, శాలువాతో సన్మానం
+ పలు అంశాలపై చర్చ
కాంగ్రేస్ పార్టీ ఆదిలాబాద్ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలంను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శనివారం కాంగ్రేస్ కార్యకర్తలతో కలిసి ఎస్పీ క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన కంది శ్రీనివాస రెడ్డి, ఈ మేరకు ఎస్పీకు పూలబొకే అందించి, శాలువాతో సత్కరించారు. ఆదిలాబాద్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి సారిగా ఎస్పీని కలిసిన ఆయన, జిల్లా రాజకీయ, తదితర అంశాలౖపై కొద్దిసేపు చర్చించారు. ఎస్పీని కలిసిన వారిలో డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, మాజీ చైర్మెన్ ముడుపు దామోదర్ రెడ్డి, నాయకులు తుమ్మల వెంకట్రెడ్డి, నాక్లే రాందాస్, సామ రుపేష్ రెడ్డి, ఎల్టి వెంకట్ రెడ్డి, ఎం. ఏ షకీల్, తదితరులు ఉన్నారు.