Condolence Visits By Jogu: పలు కుటుంబాలను పరామర్శించిన జోగు రామన్న…

సిరా న్యూస్, ఆదిలాబాద్: 

పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి జోగు రామన్న…
+ జైనథ్, ఆదిలాబాద్‌ రూరల్‌ మండలాల్లో పర్యటన

మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్, ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని పలు కుటుంబాలను పరామర్శించారు. జైనథ్‌ మండలంలోని పెండల్‌వాడ గ్రామానికి చెందిన మున్నూర్‌కాపు సంఘం తాలుకా మాజీ అధ్యక్షులు సుగ్గెం విఠల్‌ అల్లడు కంది జైపాల్‌ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా జైపాల్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం జైనథ్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త భానుచందర్‌ కుటుంబ సభ్యులను, రామాయికి చెందిన యమున బాయి, లోకారికి చెందిన మడావి సోము, తదితర కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆయన వెంట జైనథ్‌ ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, ఆదిలాబాద్‌ ఎంపీపీ గండ్రత్‌ రమేష్, నాయకులు అడప తిరుపతి, మద్దుల ఊషన్న, మెట్టు ప్రహ్లాద్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *