రామమందిరం అక్షింతల పంపిణి కార్యక్రమం

పాల్గొన్న బీజేపీ నేత బానోతు విజయలక్ష్మి
సిరా న్యూస్, ఇల్లందు;
ఎన్నో ఏళ్లగా ఉన్న హిందువుల కల అయోధ్యలో రామమందిరం నిర్మాణం ప్రధానమంత్రి మోడీతోనే సాధ్యమైందని బిజెపి నాయకురాలు బానోతు విజయలక్ష్మి తెలిపారు .
ప్రధాని మోడీ,హోంమంత్రి అమిత్ షా నేతృత్వం లో కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడబోతుందని. ఇల్లందు టేకులపల్లి మండలం లో రాముడి అక్షింతల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అక్షింతలను పంపిణీ చేశారు. రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో నిర్వాహకులు అక్షింతల పంపిణీని ప్రారంభించారు. జనవరి 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.అయోధ్యలో ఈ నెల 22న రామ్లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *