రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
సిరా న్యూస్,కమాన్ పూర్;
పల్లె దవాఖానా ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. శనివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు రామగిరి మండలంలో పర్యటించి కల్వచర్ల గ్రామంలో 20 లక్షల అంచనా విలువతో నిర్మించిన పల్లె దవాఖానాను ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పల్లె దవాఖానాలో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కౌంటర్, డిస్పెన్సరీ, వెయిటింగ్ హాల్, ల్యాబ్ ఏరియా, యోగా, డ్రెస్సింగ్ రూమ్ లను పరిశీలించి, పల్లె దవాఖాన ద్వారా ప్రజలకు అందించనున్న వైద్య సేవలు, ఔషధ వివరాలను, గర్భిణులకు అందించు వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వైద్యాధికారులు, సిబ్బందితో మాట్లాడుతూ, పల్లె దవాఖాన ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, డాక్టర్లు, సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటు లో ఉండి, పల్లె దవాఖానలో, ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న సేవల గురించి గ్రామ ప్రజలకు వివరించాలని, వారితో మమేకమై ప్రభుత్వపరంగా అందిస్తున్న వైద్య సేవలపై భరోసా కల్పించాలని, గ్రామ పరిధిలో ఉన్న గర్భిణీలు అనీమియాతో బాధపడకుండా ఐరన్ టాబ్లెట్లు విధిగా అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్ కుమార్, తహసిల్దార్ రామ్ చందర్ రావు, ఎంపిపి అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, సర్పంచ్ గంట పద్మ వెంకట రమణారెడ్డి, ఉప సర్పంచ్, వేము కనకయ్య ఎంపిటిసి కొట్టే సందీప్, గ్రామ వార్డ్ సభ్యులు, కో ఆప్షన్ మెంబెర్స్, ఇతర ప్రజా ప్రతినిధులు, వైద్య అధికారి డాక్టర్ ప్రదీప్, ఎం.ఎల్.హెచ్.పి.- బి. ధీరజ, ఎం.పి.హెచ్. డబ్ల్యూ డి. తార, పి.తిరుమల, ఆశా లు డి.విజయ లక్ష్మీ, ఆర్. రాజ్యలక్ష్మీ, టి. స్వప్న, ఈ.శారద, సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.