Mudupu Prabhakar Reddy: జైపాల్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభాకర్‌ రెడ్డి

సిరా న్యూస్, ఆదిలాబాద్:

జైపాల్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభాకర్‌ రెడ్డి

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని పెండల్‌వాడ గ్రామానికి చెందిన సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి సుగ్గెం విఠల్‌ అల్లుడు కంది జైపాల్‌ కుటుంబ సభ్యులను సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌ రెడ్డి పరామర్శించారు. శనివారం నాయకులతో కలిసి పెండల్‌వాడకు వెళ్లారు. ఈ సందర్భంగా జైపాల్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి, తన ప్రగా«ఢ సానుభూతి తెలిపారు. జైపాల్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరారు. ఆయన వెంట సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు అర్ధాంగి రమేష్, నాయకులు గెడం పొచిరాం, బుర్రి సట్వాజీ, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *