సిరా న్యూస్, గుడిహత్నూర్:
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
– సామాజిక కార్యకర్త ఉపారపు సత్యరాజ్
యువత చదువు, కెరీర్తో పాటు క్రీడల్లో సైతం రాణించాలని రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు ఉపారపు సత్యరాజ్ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన గుడిహత్నూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో యువకులకు వాలీబాల్ కిట్ అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువతకు, క్రీడాకారులను ప్రొత్సహించేందుకు తాను ఎల్లవేళల ముందు వరుసలో ఉంటానని అన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీయడమే లక్ష్యంగా కిట్ల పంపిణీ చేస్తునట్లు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు లోనుకాకుండా, జీవితంలో స్థిరమైన లక్ష్యంతో ముందుకు సాగాలని ఆకాక్షించారు. ఈ సందర్భమ్గా యువకులు సుధామ్, మిలింద్, సచిన్, పవన్, రాహుల్, ఇతర గ్రామస్తులు ఉపారపు సత్యరాజ్ సేవలను కొనియాడారు. తమకు వాలీబాల్ కిట్ అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.