Godadive kalyanam: కన్నుల పండుగ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ వేడుకలు

సిరా న్యూస్ తలమడుగు

మంచిర్యాల జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడాది ఈ మాసంలో నిర్వహించే శ్రీ లక్ష్మీ గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్ఛోరణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి పండగ సెలవులు కావడంతో ఆలయానికి ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి మండల వాసులే కాకుండా జిల్లా వ్యాప్తంగా భక్తులు విచ్చేయడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణాన్ని పురస్కరించుకొని రెండు మూడు రోజుల నుంచి ఆలయాన్ని పూలమాలతో మామిడి తోరణాలతో రంగురంగుల కాంతి రేఖలతో ఆలయాన్ని అలంకరించారు. భక్తులు అధికంగా రావడంతో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.  కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ముడుపు కేదారేశ్వర్ రెడ్డి ఉపాధ్యక్షులు కస్లాల ప్రతాప్ కోశాధికారి బర్కం మల్లేష్, సభ్యులు, గ్రామస్తులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *