పరారీలో దుండగులు
సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి మండలం కొత్తపల్లి, భోజన్నపేట గ్రామాల మధ్య హుస్సేన్ మియా వాగు పై ఉన్న చెక్ డ్యామ్ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జిలటన్ స్టిక్స్ తో పేల్చేందుకు ప్రయత్నించారు. అర్ధరాత్రి పూట చెక్ డ్యామ్ వద్ద ఉన్నవారిని పొలం వద్ద ఉన్న రైతులు గమనించి వెంబడించడంతో 11 జిల్టన్ స్టిక్స్ వైబ్రేటర్ మిషన్ ను వదిలేసి పారిపోయారు. సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 11 జిల్టెన్ స్టిక్స్ ను వైబ్రేటర్ మిషన్ ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు.