ZPTC Ganesh Reddy: విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయి కి ఎదగాలి

విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయి కి ఎదగాలి

-తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి

సిరా న్యూస్ తలమడుగు

తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో చదువుతున్న విద్యార్థుల విజ్ఞప్తి మేరకు గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేసి అందులో స్టడీ మెటీరియల్ కోసం స్థానిక జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి రూ 40వేలు అందజేశారు. గ్రామానికి చెందిన లోక ప్రవీణ్ రెడ్డి రూ. 5 వేలు, దివాకర్ కుర్చీలను వితరణ చేశారు. ఈ సందర్బంగా తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ మౌలిక వసతుల కోసం జడ్పీటీసీ నిధుల నుంచి రూ  లక్ష రూపాయలు కేటాయించగా గ్రామంలోని విద్యార్థులు వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు . కార్యక్రమంలో సర్పంచ్ పుండ్రు పోతారెడ్డి,అంబేద్కర్ యూత్ అధ్యక్షులు బిట్ల చైతన్య, సొసైటి సీఈవో మోతి శ్రీనివాస్,నిట్టేడి గంగాధర్, గోనెలా గంగన్న, వెంకటేష్ యాదవ్, గాజుల సాంబశివ్, మల్లేష్ యాదవ్, ధనంజయ్, చెన్నాల సాయి,సతీష్ రెడ్డి, భూమన్న,బొజ్జ గంగన్న, కే గంగన్న ,యువకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *