ఓటర్ల జాబితా లో తప్పులు లేకుండా పకడ్బందీగా నమోదు చేయా

సిరా న్యూస్; నాగర్ కర్నూల్;

వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్

ఓటర్ల జాబితా లో తప్పులు లేకుండా పకడ్బందీగా నమోదు చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు. (నేడే మంగళవారం) ఐ డి ఓ సి కాన్ఫరెన్స్ హాల్ నుండి అదనపు కలెక్టర్లు. ఆర్డిఓ. తాసిల్దార్ లతో శుద్ధమైన ఓటర్ జాబితా రూపొందించడం పై వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు. జనవరి1.2024 నాటికి 18 సంవత్సరాల వయసు పూర్తి అయిన ఇప్పటికే ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవడం జరిగిందని వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఓటర్ జాబితాలో పేరు నమోదు చర్యలు. తీసుకోవాలని తాసిల్దార్ లను ఆదేశించారు. తమ లాగిన్ ఉన్న వాటిని సత్వరమే పరిష్కరించాలని బిఎల్ఓ స్థాయిలో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి ఆమోదం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటర్ నమోదు ప్రక్రియ త్వరగా పూర్తి కానందున ఓటర్లు కొన్నిసార్లు పలుదఫాలుగా దరఖాస్తు చేసుకుంటారని అందువల్ల ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఎట్టి పరిస్థితు లోను డబుల్ ఎంట్రీ ఉండటాని కి వీలు లేదని అన్నారు. బి ఎల్ వో లు సక్రమంగా పని చేస్తున్నారా లేదా అనేది బిఎల్ఓ సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. చనిపోయిన ఓటర్లు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లు జాబితా చేసుకుని సరైన ఆధారాలు నిబంధనల ప్రకారం జాబితా నుండి తొలగింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఒక పోలింగ్ స్టేషన్లో ఉన్న వాటిని గుర్తించి వారి నుండి దరఖాస్తు తీసుకుని సరిచేయాలని తెలియజేశారు. జనవరి 20. 21వ తేదీన రెండు రోజులు వనపర్తి జిల్లాలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రత్యేక ఓటర్ నమోదు దినోత్సవం పై గ్రామాలలో పెద్ద ఎత్తున ముందస్తు ప్రచారం చేయించాలని టామ్ టామ్ చేయించి అందరికీ అవగాహన కల్పించాలని అన్నారు. ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం నాడు ఉదయం 10 గంటలకే బి ఎల్ వో లు. ముసాయిదా ఓటర్ జాబితాతో తమ పోలింగ్ కేంద్రాలలో హాజరు ఉండాలనిఆదేశించారు.ముఖ్యంగా దివ్యాంగులు ట్రాన్స్ జెండర్ లు ఏ ఒక్కరు మిగిలి పోకుండా నమోదు చేయించాలని అన్నారు. జాబితాలో ఉన్న పి.డబ్ల్యు.డి. 80 సంవత్సరాలు పైబడిన వారి పేర్లను ముసాయిదా ఓటర్ జాబితాలో మార్నింగ్ చేయించాలని తెలియజేశారు. జనవరి 25 నాడు జాతీయ ఓటర్స్ దినోత్సవం నిర్వహణపై ఇప్పటికే సర్కులర్ జారీ చేయడం జరిగిందని మండల కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించాలని ఆదేశించారు. చిత్రంలో వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. వనపర్తి సి సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ రాజేష్. వనపర్తి జిల్లా మీడియా పౌర సమాచార అధికారి సీతారాం నాయక్ తదితరులు ఉన్నారు.
==============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *