60 ఏండ్లు అధికారంలో ఉండి చేయని న్యాయం, ఏకం ఇప్పుడెలా చేస్తారు ?
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్
సిరా న్యూస్,జగిత్యాల;
మత విద్వేషాలను ఒడిస్తామని వేర్పాటువాద రాజకీయాల నుండి దేశాన్ని రక్షిస్తామని 60 ఏండ్లు అధికారంలో ఉండి ఏనాడు దేశ ఐక్యత గురించి ఒకే దేశంలో ఉన్న ప్రజలందరి ఒకే న్యాయం ఒకే చట్టం అని మాట్లాడకుండ కాశ్మీర్ ను దేశంలో అంతర్భాగంగా చేయలేకపోయిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేయడం విడ్డురంగా ఉందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు.
మంగళవారం పెగడపెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాతే మతప్రాతిపదికన దేశాన్ని మూడు ముక్కలు చేసి ఇప్పుడు దేశాన్ని ఏకం చేస్తా అనడం సిగ్గుచేటన్నారు. గతంలో భారతదేశం ఒక దేశం కాదని వివిధ రాష్ట్రాల సమూహం అని దేశ ఐక్యతకు భంగం కలిగించే విదంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక హక్కులను కల్పిస్తూ 370 ఆర్టికల్ తెచ్చి దేశ సమగ్రతను దెబ్బతీసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు.మోడీ ప్రభుత్వం వచ్చాక 370 ఆర్టికల్ రద్దుచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మల్లి 370 ఆర్టికల్ ను పునరుద్దరిస్తామని ఒకవైపు బహిరంగ ప్రకటనలు చేస్తూనే దేశాన్ని ఏకంచేసి న్యాయం చేస్తామనడం దేశప్రజలను మరోసారి మోసం చేయడానికేనని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జమ్మూకాశ్మీర్ లో ముస్లింల దాడికి తట్టుకోలేక 30 లక్షల మంది కశ్మీర్ పండిట్లు శరణార్ధులుగా మారి ఢిల్లీ పురవీధుల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం గడిపితే ఏనాడు స్పందించని కాంగ్రెస్ పార్టీ మోడీ హాయంలో శత్రు దేశాలపై జరిగిన సర్జికల్ దాడులు,గాల్వాన్ లోయలో జరిగిన ఘటన అంత డొల్ల అని దేశాన్ని దేశ సైనికులను అవమానపరిచిన రాహుల్ గాంధీకి భారత్ జోడో న్యాయ యాత్ర చేసే అర్హత లేదన్నారు.అంతేకాకుండా దేశద్రోహిగా ముద్ర వేయించుకున్న జేఎన్యూ విద్యార్థి రాబోయే తరానికి కమ్యూనిస్టు నాయకుడు కన్నయ్య కుమార్ భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తామని బహిరంగంగా నినాదాలు చేస్తే మద్దతు పలికిన రాహుల్ గాంధీ ఇప్పుడు తను చేస్తున్న యాత్ర ద్వారా ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మొదటి విడతలో నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిందని ఇప్పుడు చేస్తున్న యాత్ర భారత్ జోడో న్యాయ యాత్ర 42 పార్లమెంట్ సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 24 సీట్లకు పరిమితం కాబోతుందని ఎద్దేవాచేశారు. రాజకీయ పరిపక్వత లేని రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో ఎప్పటికి సుస్థిర స్థానం సంపాదించుకోలేరని ప్రపంచ నాయుకుడు అయిన మోడీని గద్దె దించడం 20 సంవత్సరాల దాకా ఎవరితరం కాదన్నారు…ఒకవేళ నిజంగా రాహుల్ గాంధీకి భారత దేశాన్ని ఏకంచేసి న్యాయం చేయాలని ఉంటే ముందుగా ఈయాత్ర పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో చేయాలని అన్నారు.ఈసమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు గంగుల కొమురెల్లి, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చింతకింది అనసూయ,మర్రిపెల్లి గంగాధర్,కొత్తూరి బాబు, పెంట నరేందర్,చింతకింది కిషోర్, మన్నే రమేష్, తోడేటి గట్టయ్య మన్నే రమేష్ తదితరులు పాల్గొన్నారు…