సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చెల్ జిల్లా చర్లపల్లిలో అద్దెకు ఉంటున్న బీహార్ నుండి 5 నెలల బతుకు దెరువు కోసం వచ్చిన ప్రదీప్ రునా కుమారుడు ప్రిన్స్ (8) చర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాడు.నిన్న సోమవారం మద్యాహ్నం నుండి కనిపించకపోవడంతో అతని కుటుంబసభ్యులు చర్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. తరువాత చర్లపల్లి నుండి రైల్వే స్టేషన్ కు వెళుతుండగా కనకదుర్గ వైన్స్ ఎదురుగా చెట్ల మధ్యన ప్రిన్స్ మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితం పోలీసులు కనుగొన్నారు.గాలి పటం కోసం వెళ్లి ఏమైనా గోడపై నుండి కింద పడి మృతి చెంది ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. . పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పటల్ కి తరలించారు.