తప్పతాగి.. యాక్సిడెంట్ చేసి..

సిరా న్యూస్,హైదరాబాద్;
బంజారాహిల్స్, పబ్ లో స్నేహి తులతో కలిసి తప్పతాగాడు. మద్యం మత్తులో యాక్సిడెంట్ చేశాడు. కేసు నుంచి తప్పించుకు నేందుకు పోలీసుల కళ్లుగప్పే ప్రయత్నంచేశాడు. కేసునే తారుమారు చేసేందకు యత్నించిన ఆ నిందితుడు ఎట్టకేలకు నిఘా నేత్రంలో దొరికిపోయాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఇల్లందు శ్రీకాంత్ సోమవారం అర్ధరాత్రి వరకు హైటెక్ సిటీ నోవాటెల్ హోటల్లోని ఓ పబ్లోలో స్నేహి తులతో కలిసి మద్యం సేవించాడు. సిట్టింగ్ ముగిసిన తర్వాత అతడి వెంట వచ్చిన స్నేహి తుడు నర్సింహాను పంజాగుట్టలో డ్రాప్ చేశాడు. తిరుగు ప్రయాణంలో మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ.. బంజారాహిల్స్ రోడ్ నం.3లోని గ్రీన్ మాస్క్ (మసీదు) గోడను ఢీకొ ట్టాడు. దీంతో గోడ కూలిపోయింది. నిర్వాహ కులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యా ప్రలో ఉండగా, ప్రమాదానికి కారకుడను తానే నంటూ నాగార్జున అనే వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
దర్యాప్తులో బయటపడ్డ వాస్తవాలు..
ఇదిలా ఉండగా, నాగార్జునను అరెస్టు చేసిన కొద్ది సేపటికే శ్రీకాంత్ పోలీసు స్టేషన్కు వచ్చాడు. అతడి స్నేహితుడినని, సాయం చేసేందుకు వచ్చానని చెప్పాడు. అతడి ఒంటిపై ఉన్న గాయాలు, ప్రవర్తనలో తేడా కనిపించింది. ప్రజాభవన్ వద్ద ఇటీవల జరిగిన ఘటన నేపథ్యంలో పోలీసులు ఈ కేసును బంజారాహిల్స్ డీఐ జాకీర్ హుస్సేన్ లోతుగా దర్యాప్తు చేశారు. ప్రమాదం జరిగిన తీరును సీసీ పుటేజీల ద్వారా పరిశీలించగా, పోలీసుల ఎదుట లొంగిపోయిన నాగార్జున ఆ సీనులోనే లేడని, కారు నడిపిన వ్యక్తి ఇల్లందు శ్రీకాం త్గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కళ్లు గప్పి కేసును తారుమారు చేసేందుకు నింది తుడు యత్నించాడని తేల్చారు. బ్రీత్ అనలై జింగ్ పరీక్ష చేయగా 126/100 ఎంఎల్గా నిర్ధారణ జరిగింది. దీంతో పోలీసులు నింది తుడిపై 308, 427, 279, 201, 203, 419 రెడ్విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *