ఆపదలో ఆపద్బాంధవుడు

సిరా న్యూస్,భైంసా;
భైంసా మండలంలోని కామోల్ గ్రామానికి చెందిన గుమ్ముల ద్రుపద బాయి నివాసం ఉంటున్న ఇంట్లో ఇటీవల సిలిండర్ పేలి మృతి చెందింది. ఇళ్ళు పూర్తిగా దగ్దం అయింది. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్ వారి కుటుంబాన్ని ఆపదలో ఆపద్బాంధవుడిగా ఆదుకున్నారు. ఉండడానికి ఇళ్ళు లేక, తీవ్రమైన పేదరికంతో బాధపడుతున్న ఆ కుటుంబాన్ని స్వంత ఖర్చులతో కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఆ కుటుంబం గ్రామంలోని ఓ సంఘం భవనంలో కాలం వెల్లదిస్తున్నారు. బుధవారం మోహన్ రావు పటేల్ నిర్మించి ఇచ్చిన ఇంట్లో రేకుల షెడ్డులో వెళ్లారు. ఈ సందర్భంగా మోహన్ రావు పటేల్ నిత్య అవసర సరుకులు అందచేశారు. దింతో కుటుంబ సభ్యులు ఏడుస్తూ పటేల్ కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కూడా ఎవరికి అపద వచ్చిన వెంటనే స్పందించి తగిన సహాయం చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *