Ambedkar should make the unveiling of the statue a success : అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణను విజయవంతం చేయాలి

-మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న పిలుపు
సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
విజయవాడ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహం, స్మృతి వనం విగ్రహా ఆవిష్కరణకు అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న పేర్కొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని తన స్వగృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల కలసి బహుజన సిద్ధాంతంతో అధిక సంఖ్యలో పాల్గొని విజయం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు పట్టణ అధ్యక్షుడు ఎద్దుల. చెన్నయ్య, పట్టణ ఉపాధ్యక్షులు డి. మల్లికార్జున, నందవరం మండల సీనియర్ నాయకులు పంపయ్య, జై గౌడ్ సేన తాలూకు అధ్యక్షులు రంగన్న గౌడ్, దళిత సంఘ నాయకుడు స్వామి దాస్, మాల మహానాడు నాయకులు మాల. హనుమంతు, మాల. కొండయ్య, మాల. పెద్దయ్య, మాల.ఉరుకుందు, మాల. రాజోలప్ప, మాల.రాజు, మాల రాజేష్, మాల హనుమంతు, మాల. రంగన్న, మాల. బసవరాజు, మాల. నరసింహులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *