సిరా న్యూస్, ఆదిలాబాద్:
త్వరలోనే బీఆర్ఎస్ను ఖాలీ చేస్తాం…
– కంది శ్రీనివాస రెడ్డి
+ ఆదిలాబాద్లో కార్యకర్తలతో సమీక్షా సమావేశం
+ భారీగా చేరికలు
+ డబ్బులు తీసుకొని పార్టీ మారుతున్నారని జోగు రామన్న చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం
+ దైవ సాక్షిగా ప్రమాణానికి జోగు రామన్న సిద్ధమా అంటూ సవాల్
ఆదిలాబాద్లో త్వరలోనే బీఆర్ఎస్ను పూర్తి స్థాయిలో ఖాలీ చేసి, జోగు రామన్న 40ఏళ్ల రాజకీయ చరిత్రను భూస్థాపితం చేస్తామని కాంగ్రేస్ పార్టీ ఆదిలాబాద్ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవలే నూతనంగా పార్టీలో చేరిన పలువురు నాయకులను ఆయన శాలువాలతో సత్కరించారు. పార్టీలోకి చేరేందుకు వివిద గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులకు కాంగ్రేస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. డబ్బులు తీసుకొని కొంత మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రేస్లోకి వెళ్లారాని జోగు రామన్న చేసిన వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపలు చేయడం తగదని హితువు పలికారు. ఈ విషయంపై దైవసాక్షిగా ప్రమాణం చేయడానికి జోగు రామన్న సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
సమిష్టిగా ముందుకు…
పాత, కొత్త అంటూ భేద భావం లేకుండ కార్యకర్తలంత కలిసికట్టుగా పార్టీ పటిష్ఠత కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రజలందరికీ అందేలా కృషీ చేయాలని ఆయన అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 20 వేలకు తగ్గకుండా మెజారిటీ ఇవ్వాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని సత్తా చాటాలని కోరారు.