సిరా న్యూస్, ఆదిలాబాద్:
రైల్వే సాధన కమిటీ రిలేదీక్షలకు కంది శ్రీనివాసరెడ్డి సంఘీభావం
+ ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్
ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు కోసం రైల్వే సాధన కమిటీ చేపడుతున్న రిలే నిరాహరదీక్షలకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాసరెడ్డి సంఘీభావం తెలిపారు. గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆదిలాబాద్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ… ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల కల అయినటువంటి ఆర్మూర్ లైన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం రైల్వే లైన్ సాధన కమిటీ సభ్యులు చేపడుతున్న దీక్షలను ఆయన అభినందించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పోరాటానికి ఆయన పూర్తి మద్దతు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని అన్నారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ఈ రైల్వేలైన్ నునిర్మాణాన్ని కేంద్రం దశాబ్దాలుగా నాన్చుతోందని విమర్శించారు. ఈ లైన్ పూర్తి అయితే, ఈ ప్రాంతానికి విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు ఎంతో మేలు జరుగుతోందని అన్నారు. వెంటనే ఈ విషయమై కేంద్రం దృష్టి సారించి జిల్లావాసుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు తుమ్మల వెంకట్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఫైజుల్లా ఖాన్, అల్లూరి అశోక్ రెడ్డి, మానే శంకర్, రూపేష్ రెడ్డి, దీపక్ రావు, మహమూద్, హరీష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.