సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
వచ్చే నెల 21 నుండి మూడు రోజులపాటు జరిగే సమ్మక్క సారక్క జాతర కంటే ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో గత వారం నుండి వేములవాడకు భక్తుల రద్దీ ఎక్కువైంది. హుండీ లెక్కింపు ద్వారా దాదాపు రెండు కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల హుండీ లెక్కింపును నిర్వహించారు. 21 రోజుల హుండీ ఆదాయం రెండు కోట్ల 52 లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు నగదు రుపేణా, 277 గ్రాముల బంగారం, 13 కిలోల వెండి ఆదాయంగా సమకూరింది. మరో నెల రోజులపాటు వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల రాక అధికంగా ఉంటుంది. హుండీ లెక్కింపులో ఆలయ అధికారులతో పాటు సేవా సిబ్బంది పాల్గొన్నారు.