సిరా న్యూస్,తాండూరు;
తాండూర్ మండల్ కిష్టంపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2024_ 25 సంవత్సరంగాను కిష్టంపేట సర్పంచ్ సార్ల పద్మ రమేష్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభ కార్యక్రమంలో కిష్టంపేట గ్రామ పరిధిలో 2024 ౼25 సంవత్సరంలో చేయవలసిన అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామపంచాయతీకి వచ్చే కేంద్ర రాష్ట్ర నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పథకంలో ముందుంచుటకుచేయవలసిన పనులపై కార్యాచరణ ప్రణాళిక తయారు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అగ్రికల్చర్ ఏవో శంకర్, గ్రామపంచాయతీ కార్యదర్శి బాపురావు,గ్రాంపంచాయితి కోప్షన్ సత్యనారాయణ,వార్డ్మెంబెర్లు, అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు,గ్రామ ప్రజలు కామని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.