Tige Attack on cow: చిరుతపులి దాడిలో ఆవు మృతి

సిరా న్యూస్, బజార్హత్నూర్‌:

చిరుతపులి దాడిలో ఆవు మృతి

ఆదిలాబాద్‌ జిల్లా బజార్హాత్నూర్‌ మండలంలోని చిన్మయితాండ గ్రామ సమీపంలోని వ్యవసాయ భూమిలో గురువారం ఆవుపై చిరుతపులి దాడి చేసి, హతమార్చిన సంఘటన కలకలం రేపింది. స్థానిక బీట్‌ ఆపీసర్‌ లక్ష్మణ్‌ కథనం ప్రకారం… మండలంలోని గంగాపూర్‌ గ్రామానిక చెందిన సుధాం అనే రైతుకు చెందిన పలు ఆవులు చిన్మయి తండా సమీపంలో ఓ చేన్లో మేత మేస్తుండగా, ఒక్కసారిగా పులి దాడి చేసింది. ఈ దాడిలో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు విలువ దాదాపు రూ. 80వేల వరక ఉంటుందని, తనకు పరిహారం అందించి ఆదుకోవాలని సదరు రైతు వేడుకుంటున్నాడు. కాగా కాగా శ్యామ్‌రావు గూడ గ్రామానికి చెందిన శత్రు అనే రైతుకు చెందిన ఆవుపై సైతం పులిదాడి చేనట్లు తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో ఆవు ప్రాణాలతో బయటపడినట్లు స్థానికుల తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *