సిరా న్యూస్, ఆదిలాబాద్:
సమస్యల పరిష్కారానికి కృషీ…
– ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్
+ టక్కుగూడలో పర్యటన
+ పార్టీ జెండా ఆవిష్కరణ
గ్రామాల్లో ఏండ్లుగా నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కృషీ చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఆయన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని టక్కుగూడ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఢోలు, వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొని ఉన్న తాగు నీరు, రోడ్లు వంటి సమస్యలను యుద్దప్రాతిపదికన పరిష్కరిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాల అభివృద్దే ధ్యేయంగా ముందుకుపోతామని ఆన్నారు. కాంగ్రేస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, అర్హులైన నిరుపేదలందరికి సంక్షేమ పథకాలు అందించి ఆదుకుంటామని ఆయన అన్నారు. అనంతరం స్థానిక నాయకులు, గ్రామస్తులతో కలిసి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.