నేడు ఆయన జయంతి
సిరా న్యూస్;
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడు, నిర్మాత బి.విఠలాచార్యది ఓ ప్రత్యేకమైన స్థానం .. అప్పట్లో అయన సినిమాలు వెరైటీగా ఉండేవి .. అయన సినిమాలో కనిపించే చిత్ర, విచిత్రాలు మనకి మరే సినిమాలో కూడా కనిపించేవి కావు .. అయన సినిమాల్లో దయ్యాలు , అస్థిపంజరాలు , చిలకలు, కోతులు మొదలనవి కూడా ప్రేక్షకులను నవ్వించేవి ..ఆయన సినిమాల్లో “లాజిక్’ అక్కర్లేదు, అరె అసలు ‘అదెందుకు జరిగింది?’ అని అడగడానికి లేదు. ప్రేక్షకుల్ని ఆహ్లాదపరచడమే అయన సినిమాల ముఖ్య లక్షణం.ఏదైనా సినిమా షూటింగ్ కి ఎవరైనా ఓక ఆర్టిస్టు మిస్ అయితే షూటింగ్ కి , సినిమాకి ఇబ్బంది అవుతుంది. కానీ విఠలాచార్యకి మాత్రం అలాంటి భయాలు ఏమి ఉండేవి కాదట .. అలాంటి సందర్భంలో అయన అప్పటికప్పుడు ఓ సన్నివేశాన్ని మర్చి , ఓ పాత్రను సృష్టించి సినిమాని అనుకున్న విధంగా, అనుకున్న టైంకి తెరకెక్కించే వారు ..నటీనటుల కాల్ షీట్లు గల్లంతైతే, వాళ్లని చిలకలుగానో, కోతులుగానో మార్చడం ఆయనకే చెల్లిందని ఒక సందర్భంలో కాంతారావు చెప్పారు.. ఉదాహరణకి జగన్మోహిని చిత్రం అందరికి గుర్తుండే ఉంటుంది . అందులో కొరివి దెయ్యాలు పొయ్యిలో కాళ్లు పెట్టి వంట చేయడం లాంటి సన్నివేశాలు ప్రేక్షకులను ఎంత నవ్వించాయో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు… నిజం చెప్పాలంటే ఇలాంటి ప్రయోగాల వల్లే విఠలాచార్య గారు దర్శకుడిగా ప్రేక్షకుల మదిలో నిలిచారు.. బి.విఠల ఆచార్య లేదా బి.విఠలాచార్య ‘జానపద బ్రహ్మ’ అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 70 చిత్రాలను రూపొందించిన ఈయన 1920 జనవరి 20 న కర్ణాటకలో ఉడిపిలో జన్మించారు. ఆయన ఎన్నో జానపద చిత్రాలకు అద్భుతమైన దర్శకత్వం వహించారు. అప్పటి పరిమితమైన సాంకేతిక పరిజ్ఙానముతో ఆయన చూపించిన ప్రతిభ అసామాన్యమైనది. చాలా కొద్ది ఖర్చుతో ఆయన కనులకింపైన జానపద కళా ఖండాలను రూపొందించారు. 1942 లో చిత్రరంగ ప్రవేశము చేసిన ఈయన నిర్మాతగా t gytడి.శంకర్ సింగ్ తో కలిసి దాదాపు 18 చిత్రాలను తమ మహాత్మా పిక్చర్స్ పతాకముపై నిర్మించారు. వీటిలో సాంఘిక చిత్రాలే అధికము.ఆ తరువాత తొలిసారిగా తెలుగులో 1953లో షావుకారు జానకి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి దర్శకత్వము వహించాడు. క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలను తీశాడు. ఈయన దర్శకత్వము వహించిన చిత్రాలలో 15 చిత్రాలు నందమూరి తారక రామారావు నటించినవే అందులో 5 చిత్రాలను విఠలాచార్యే స్వయంగా నిర్మించాడు.జానపదబ్రహ్మ 1999, మే 28 న 80 యేళ్ల వయసులో మద్రాసులోని తన స్వగృహములో కన్నుమూశారు. ఈయనకు ఒక భార్య, నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు..