సిరా న్యూస్, ఆదిలాబాద్:
రైల్వే లైన్ సాధన కమిటీకి సంఘీభావం తెలిపిన సుహాసిని రెడ్డి..
రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులు ఆదిలాబాద్- ఆర్మూర్ రైల్వే లైన్ సాధన కోసం ముందుకు రావాలని బిజెపి రాష్ట్ర నాయకురాలు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజులుగా రైల్వే లైన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు శుక్రవారం ఆమె మద్దతు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కాంక్ష అయిన రైల్వే లైన్ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు.