చిగురుమామిడి, సిరా న్యూస్
ఓటర్ నమోదును సద్వినియం చేసుకోవాలి…
ఓటర్ నమోదు స్పెషల్ క్యాంపెయిన్ డే ను సద్వినియోగం చేసుకోవాలని చిగురుమామిడి తహసీల్దార్ ఇప్ప నరేందర్ అన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఈ నెల 20,21 తేదీల్లో నిర్వహించే ఓటరు నమోదు స్పెషల్ క్యాంపు డే కార్యక్రమంలో ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు. శని ఆదివారాల్లో రెండు రోజుల పాటు మండల వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో బీఎల్వో ల ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఇది వరకే ఓటు హక్కు కలిగి ఉంటే సవరణలు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. కొత్త ఓటరు నమోదు కు టెన్త్ మెమో, ఆధార్, ఫొటో. సవరణలకు పేరు, ఇంటి పేరు, గ్రామం, మండలం, జిల్లా మొదలగు సవరణలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.