జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

 సిరా న్యూస్, జగిత్యాల్:

ఆగి ప్రమాదాన్ని చూస్తున్న వ్యక్తులపైకి దూసుకెళ్లిన మరో వాహనం… ఇద్దరికి తీవ్ర గాయాలు..

అప్పటికే అక్కడ ప్రమాదం జరిగింది.. అలా వెళ్తున్న వాహనదారులు ఏం జరిగిందోనని ఆగి చూస్తుండగా వారిపై మరో వాహనం దూసుకొచ్చిన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది.
జగిత్యాల గ్రామీణ మండలం పొలాస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు.. జగిత్యాల కు చెందిన దయాల రమేశ్, గణేశ్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రమేశ్ అక్కడిక్కడే మృతి చెందగా గణేశ్ తీవ్రంగా గాయపడి రోడ్డు పై పడిపోయాడు.. ఈ ప్రమాదాన్ని చూసేందుకు ద్విచక్రవాహనం వెళుతున్న ధర్మపురి మండలం నేరెళ్ల కు చెందిన అక్కినపల్లి బాబుకుమార్, సత్తయ్య ఆగారు… ఈ క్రమంలో మరో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది.. బాబు కుమార్ కాలు పూర్తిగా తెగిపోయి కొద్ది దూరంలో పడిపోయింది. సత్తయ్యకు తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. ప్రమాదం జరిగిన రహదారిపై రెండు కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ స్తంభించగా.. జగిత్యాల రూరల్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *